ఎపిలో 2 వీలర్ , 4 వీలర్స్ పై టాక్స్ పెంపు
- September 05, 2020
అమరావతి: ఎపిలో రవాణ శాఖలో పన్నులు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. 2 వీలర్, 4 వీలర్స్ పై విధించే లైఫ్ ట్యాక్స్ పెంచాలని రవాణ శాఖ చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకారం తెలిపినట్టుసమాచారం. పన్నుల పెంపు ప్రతిపాదనల ద్వారా అదనంగా రూ.400 కోట్లు వస్తాయని రవాణా శాఖ అంచనా వేస్తోంది. 2 వీలర్, 4 వీలర్స్ పై లైఫ్ ట్యాక్స్ రెండు రకాల శ్లాబుల్లో 1 నుంచి 3 శాతం మేర పెంపు ఉండేలా ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. 50 వేలలోపు ధర కలిగిన 2 వీలర్స్ ఆ పై ధర ఉన్న వాహానాలకు రెండు శ్లాబుల్లో లైఫ్ ట్యాక్స్ చెల్లింపులు చేసేలా ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. 2 వీలర్స్ పై లైఫ్ ట్యాక్స్ పెంచడం ద్వారా అదనంగా 174 కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా. 8 లక్షల్లోపు ధర కలిగిన 4 వీలర్స్ ఆ పై ధర ఉన్న వాహానాలకు రెండు శ్లాబుల్లో లైఫ్ ట్యాక్సు చెల్లింపులు చేసేలా ప్రతిపాదనలు చేశారు. 4 వీలర్స్ పై లైఫ్ ట్యాక్స్ పెంచడం ద్వారా అదనంగా సుమారు రూ.140 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. వివిధ వాహానాలకు విధించే గ్రీన్ ట్యాక్స్ రేట్ల పెంపు ద్వారా అదనంగా రూ.30 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. గ్రీన్ ట్యాక్స్ పెంపు నుంచి ఆటోలకు మినహాయింపు ఇచ్చినట్టు సమాచారం..
తాజా వార్తలు
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!







