ఎపిలో 2 వీలర్ , 4 వీలర్స్ పై టాక్స్ పెంపు
- September 05, 2020
అమరావతి: ఎపిలో రవాణ శాఖలో పన్నులు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. 2 వీలర్, 4 వీలర్స్ పై విధించే లైఫ్ ట్యాక్స్ పెంచాలని రవాణ శాఖ చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకారం తెలిపినట్టుసమాచారం. పన్నుల పెంపు ప్రతిపాదనల ద్వారా అదనంగా రూ.400 కోట్లు వస్తాయని రవాణా శాఖ అంచనా వేస్తోంది. 2 వీలర్, 4 వీలర్స్ పై లైఫ్ ట్యాక్స్ రెండు రకాల శ్లాబుల్లో 1 నుంచి 3 శాతం మేర పెంపు ఉండేలా ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. 50 వేలలోపు ధర కలిగిన 2 వీలర్స్ ఆ పై ధర ఉన్న వాహానాలకు రెండు శ్లాబుల్లో లైఫ్ ట్యాక్స్ చెల్లింపులు చేసేలా ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. 2 వీలర్స్ పై లైఫ్ ట్యాక్స్ పెంచడం ద్వారా అదనంగా 174 కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా. 8 లక్షల్లోపు ధర కలిగిన 4 వీలర్స్ ఆ పై ధర ఉన్న వాహానాలకు రెండు శ్లాబుల్లో లైఫ్ ట్యాక్సు చెల్లింపులు చేసేలా ప్రతిపాదనలు చేశారు. 4 వీలర్స్ పై లైఫ్ ట్యాక్స్ పెంచడం ద్వారా అదనంగా సుమారు రూ.140 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. వివిధ వాహానాలకు విధించే గ్రీన్ ట్యాక్స్ రేట్ల పెంపు ద్వారా అదనంగా రూ.30 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. గ్రీన్ ట్యాక్స్ పెంపు నుంచి ఆటోలకు మినహాయింపు ఇచ్చినట్టు సమాచారం..
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









