విమానాశ్రయాలను తిరిగి ప్రారంభించటానికి సిద్ధమవుతున్న ఒమన్
- September 08, 2020
మస్కట్:విమానయానికి సంబంధించి ఒమన్ సుప్రీం కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ఒమన్ లోని విమానాశ్రయాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించింది. అనంతరం విమానాశ్రయాలను ప్రారంభించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే..ఇతర దేశాల్లో కోవిడ్ తీవ్రతను బట్టి ఆయా దేశాలకు సర్వీసులను కొనసాగించాలా..లేదా..అనేది ఎప్పటిప్పుడు సమీక్షించుకుంటామని తెలిపింది. అదే సమయంలో వివిధ దేశాలతో పరస్పరం ఉన్న ఒప్పందం మేరకు అనుమతి ఉన్న దేశాలకు మాత్రమే సర్వీసులను నడపనుంది. ఇదిలాఉంటే 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యాశాఖ ఇచ్చిన నివేదికపై కూడా కమిటీ సమీక్షించింది. కరోనా నేపథ్యంలో విద్యార్ధుల భద్రతకు ప్రధాన్యం ఇస్తూనే..నాణ్యమైన విద్య అందించే అవకాశాలు, విధానాలపై చర్చించింది. విద్యార్ధుల ఆసక్తి, కరోనా తీవ్రతను పరిగణలోకి తీసుకొని అందుకు అనుగుణంగా పరిస్థితిని అంచనా వేసి విద్యా విధానంపై నిర్ణయం తీసుకోనున్నట్లు కమిటీ వివరించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







