భారత్ లో కరోనా సరికొత్త రికార్డు

- September 09, 2020 , by Maagulf
భారత్ లో కరోనా సరికొత్త రికార్డు

న్యూ ఢిల్లీ:భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 43 లక్షల 70 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 89,706 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1115 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 74,894 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశంలో మొత్తం 43,70,129 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 8,97,394 ఉండగా, 33,98,884 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 73,890 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77.77 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.69 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 20.53 శాతంగా ఉంది. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 11,54,549 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 5,18,04,677 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ కేసుల సంఖ్య 43 లక్షల మార్క్‌ను క్రాస్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com