ఖష్షోగీ హత్య కేసులో తీర్పుని స్వాగతించిన ఫ్యామిలీ లాయర్
- September 09, 2020
రియాద్:జర్నలిస్ట్ జమాల్ ఖష్షోగి హత్య కేసులో సౌదీ అరేబియన్ కోర్ట్ తీర్పుని, బాధిత కుటుంబం స్వాగతిస్తున్నట్లు ఆ కుటుంబం తరఫు లాయర్ మొతెసామ్ ఖష్షోగి చెప్పారు. 2018లో జమాల్ ఖష్షోగి హత్య జరిగిన విషయం విదితమే. అతి కిరాతకంగా జమాల్ ఖష్షోగిని హత్య చేశారు నిందితులు. నిందితులకు న్యాయస్థానం మరణ శిక్ష ఖరారు చేయగా, జమాల్ ఖష్షోగి కుటుంబం దోషులకు క్షమాభిక్ష పెట్టింది. దాంతో, మరణ శిక్ష కాస్తా జైలు శిక్షగా మారింది. నిందితుల్లో ఎనిమిది మందికి 7 నుంచి 20 ఏళ్ళ వరకు జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. ఘోరమైన హత్య జరిగిందనీ, ఈ ఘటనకు సంబంధించి దోషులపై శిక్షకు సంబంధించి భారమంతా దేవుడిపైనే వేశామనీ, తమకు న్యాయం చేసేలా సౌదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని నమ్మామనీ, అదే ఈ రోజు జరిగిందనీ జమాల్ ఖష్షోగి కుటుంబం అభిప్రాయపడినట్లు లాయర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







