ఖష్షోగీ హత్య కేసులో తీర్పుని స్వాగతించిన ఫ్యామిలీ లాయర్
- September 09, 2020
రియాద్:జర్నలిస్ట్ జమాల్ ఖష్షోగి హత్య కేసులో సౌదీ అరేబియన్ కోర్ట్ తీర్పుని, బాధిత కుటుంబం స్వాగతిస్తున్నట్లు ఆ కుటుంబం తరఫు లాయర్ మొతెసామ్ ఖష్షోగి చెప్పారు. 2018లో జమాల్ ఖష్షోగి హత్య జరిగిన విషయం విదితమే. అతి కిరాతకంగా జమాల్ ఖష్షోగిని హత్య చేశారు నిందితులు. నిందితులకు న్యాయస్థానం మరణ శిక్ష ఖరారు చేయగా, జమాల్ ఖష్షోగి కుటుంబం దోషులకు క్షమాభిక్ష పెట్టింది. దాంతో, మరణ శిక్ష కాస్తా జైలు శిక్షగా మారింది. నిందితుల్లో ఎనిమిది మందికి 7 నుంచి 20 ఏళ్ళ వరకు జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. ఘోరమైన హత్య జరిగిందనీ, ఈ ఘటనకు సంబంధించి దోషులపై శిక్షకు సంబంధించి భారమంతా దేవుడిపైనే వేశామనీ, తమకు న్యాయం చేసేలా సౌదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని నమ్మామనీ, అదే ఈ రోజు జరిగిందనీ జమాల్ ఖష్షోగి కుటుంబం అభిప్రాయపడినట్లు లాయర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
- రియాద్లో హౌజ్ హోల్డ్ డెమోగ్రాఫిక్ సర్వే ప్రారంభం..!!
- యూఏఈలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- బ్రోకరేజ్ సంస్థల పై నియంత్రణ విధించాలని ఎంపీల పిలుపు..!!
- ఒమన్ లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు..!!
- ఖతార్ లో మూడు ప్రముఖ ఆహార సంస్థలు మూసివేత..!!









