తెలంగాణలో లక్ష 50 వేల మార్కు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
- September 10, 2020
హైదరాబాద్:తెలంగాణాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంట్లలో కొత్తగా 2,534 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య లక్ష 50వేల మార్కు దాటింది. మొత్తం కరోనా కేసులు 1,50,176గా నమోదయ్యాయి. తాజాగా 11 మందిని ఈ మహమ్మారి బలితీసుకోగా.. మొత్తం మృతుల సంఖ్య 927కు చేరింది. అయితే, కరోనా నుంచి ఇప్పటివరకూ 1,17,143 మంది కోలుకోగా.. ఇంకా 25,066మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.61శాతంగా నమోదవ్వగా.. రికవరీ రేటు 78శాతంగా ఉంది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..