ఏపీ:కరోనాతో టీడీపీ సీనియర్ నేత మృతి
- September 11, 2020
ఏపీ:టీడీపీని మరో విషాదం వెంటాడింది. పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు కన్నుమూశారు. కరోనాతో ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది. గత పది రోజులుగా విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో రామాంజనేయులు చికిత్స పొందుతుండగా.. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో నాలుగు రోజులుగా వెంటిలేటర్పై చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో.. శుక్రవారం ఉదయం ఐదు గంటలకు తుదిశ్వాస విడిచారు. రామాంజనేయులు స్వస్థలం కలిదిండి మండలం అవ్వకూరు. రామాంజనేయులు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర మరియు లక్ష్మి పతి,సుదర్శన్,తులసి కుమార్,రవి కుమార్,ప్రసాద్,తులసి ప్రసాద్,సుధాకర్,అప్పాజీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







