ఏపీ:కరోనాతో టీడీపీ సీనియర్ నేత మృతి
- September 11, 2020
ఏపీ:టీడీపీని మరో విషాదం వెంటాడింది. పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు కన్నుమూశారు. కరోనాతో ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది. గత పది రోజులుగా విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో రామాంజనేయులు చికిత్స పొందుతుండగా.. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో నాలుగు రోజులుగా వెంటిలేటర్పై చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో.. శుక్రవారం ఉదయం ఐదు గంటలకు తుదిశ్వాస విడిచారు. రామాంజనేయులు స్వస్థలం కలిదిండి మండలం అవ్వకూరు. రామాంజనేయులు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర మరియు లక్ష్మి పతి,సుదర్శన్,తులసి కుమార్,రవి కుమార్,ప్రసాద్,తులసి ప్రసాద్,సుధాకర్,అప్పాజీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







