అబుధాబి:మన్సూర్ బిన్ జయాద్ తో భారత ఉన్నతాధికారి భేటీ..
- September 11, 2020
అబుధాబి:ఉప ప్రధాని షేక్ మన్సూర్ బిన్ జయాద్ నహ్యాన్ తో భారత రాయబారి సురేష్ ప్రభాకర్ ప్రభు భేటీ అయ్యారు. అబుధాబి వేదికగా జరిగిన ఈ సమావేశంలో నవంబర్ లో జరిగే జీ20 సదస్సు, ఇరు దేశాల మైత్రి, పెట్టుబడుల అంశాలే లక్ష్యంగా చర్చలు జరిగాయి. సౌదీ అరేబియాలో నవంబర్ 20, 21న జీ20 సదస్సు జరనున్న విషయం తెలిసిందే. అయితే..ప్రస్తుత సవాళ్ల నేపథ్యంలో జీ20 సదస్సు పోషించాల్సిన పాత్ర..కరోనా వైరస్ కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అభివృద్ధి కోసం పెట్టుబడుల అవసరం, అర్ధిక కార్యకాలపాలపై కూడా డిస్కస్ చేశారు. అలాగే యూఏఈ-భారత్ మైత్రి బంధం మరింత బలపడేలా పలు రంగాల్లో పరస్పర ఆర్ధిక సహకారం ఆవశ్యకతపై చర్చించారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







