అబుధాబి:మన్సూర్ బిన్ జయాద్ తో భారత ఉన్నతాధికారి భేటీ..

- September 11, 2020 , by Maagulf
అబుధాబి:మన్సూర్ బిన్ జయాద్ తో భారత ఉన్నతాధికారి భేటీ..

అబుధాబి:ఉప ప్రధాని షేక్ మన్సూర్ బిన్ జయాద్ నహ్యాన్ తో భారత రాయబారి సురేష్ ప్రభాకర్ ప్రభు భేటీ అయ్యారు. అబుధాబి వేదికగా జరిగిన ఈ సమావేశంలో నవంబర్ లో జరిగే జీ20 సదస్సు, ఇరు దేశాల మైత్రి, పెట్టుబడుల అంశాలే లక్ష్యంగా చర్చలు జరిగాయి. సౌదీ అరేబియాలో నవంబర్ 20, 21న జీ20 సదస్సు జరనున్న విషయం తెలిసిందే. అయితే..ప్రస్తుత సవాళ్ల నేపథ్యంలో జీ20 సదస్సు పోషించాల్సిన పాత్ర..కరోనా వైరస్ కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అభివృద్ధి కోసం పెట్టుబడుల అవసరం, అర్ధిక కార్యకాలపాలపై కూడా డిస్కస్ చేశారు. అలాగే యూఏఈ-భారత్ మైత్రి బంధం మరింత బలపడేలా పలు రంగాల్లో పరస్పర ఆర్ధిక సహకారం ఆవశ్యకతపై చర్చించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com