ఏపీ:కరోనాతో టీడీపీ సీనియర్ నేత మృతి

- September 11, 2020 , by Maagulf
ఏపీ:కరోనాతో టీడీపీ సీనియర్ నేత మృతి

ఏపీ:టీడీపీని మరో విషాదం వెంటాడింది. పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు కన్నుమూశారు. కరోనాతో ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది. గత పది రోజులుగా విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో రామాంజనేయులు చికిత్స పొందుతుండగా.. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో.. శుక్రవారం ఉదయం ఐదు గంటలకు తుదిశ్వాస విడిచారు. రామాంజనేయులు స్వస్థలం కలిదిండి మండలం అవ్వకూరు. రామాంజనేయులు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర మరియు లక్ష్మి పతి,సుదర్శన్,తులసి కుమార్,రవి కుమార్,ప్రసాద్,తులసి ప్రసాద్,సుధాకర్,అప్పాజీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com