ఇండియన్ ఎంబసీ - టీచర్లకు సన్మానం
- September 11, 2020
దోహా:ఖతార్లో భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్, పలువురు భారతీయ టీచర్లను సత్కరించారు. కమ్యూనిటీ బిల్డింగ్, ఎకనమిక్ ఎక్స్లెన్స్, సోషల్ సర్వీస్, ఎన్విరాన్మెంటల్ ప్రిజర్వేషన్ వంటి అంశాల్లో తమవంతు పాత్ర పోషిస్తోన్న టీచర్లను ఇండియన్ ఎంబసీ - టీచర్స్ ఫెలిసిటేషన్ సెర్మనీ సందర్భంగా సత్కరించడం జరిగింది. యూ ట్యూబ్లో ఈ కార్యక్రమం లైవ్లో ప్రసారమైంది. ఈ సందర్భంగా రాయబారి దీపక్ మిట్టల్, ఉపాధ్యాయుల సేవల్ని కొనియాడారు. బిర్లా పబ్లిక్ స్కూల్కి చెందిన రాకేష& వర్మ, డిపిఎస్ మోడర్న్ ఇండియన్ స్కూల్కి చెందిన జయంతి రాజగోపాలన్, శాంతినికేతన్ ఇండియన్ స్కూల్కి చెందిన షాకిర్ హుస్సేన్లను ఈ సందర్భంగా సత్కరించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇండియన్ స్కూల్స్లో పాటించేలా చూడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. నాలెడ్జ్ కంటే గొప్ప మిత్రుడు, రీడింగ్ కంటే గొప్ప ఆనందం ఏదీ వుండదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాటల్ని గుర్తు చేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







