తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లు పాస్
- September 11, 2020
హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన కొత్త రెవెన్యూ బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది. ఈ చట్టానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అంతకుముందు వీఆర్ఓ రద్దుకు సంబంధించిన బిల్లును కూడా సభ ఆమోదించింది. రెవెన్యూ చట్టంలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ బిల్లుపై శాసనసభలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చను మొదట సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు చర్చ కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు చట్టంపై ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఇక వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కావడంపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైస్ సభ దృష్టికి తెచ్చారు. అయితే వక్ఫ్, దేవాదాయ భూములు ఇక నుంచి రిజిస్ట్రేషన్ కాకుండా ధరణి పోర్టల్లో ఆటో లాక్ అవుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







