తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లు పాస్
- September 11, 2020
హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన కొత్త రెవెన్యూ బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది. ఈ చట్టానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అంతకుముందు వీఆర్ఓ రద్దుకు సంబంధించిన బిల్లును కూడా సభ ఆమోదించింది. రెవెన్యూ చట్టంలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ బిల్లుపై శాసనసభలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చను మొదట సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు చర్చ కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు చట్టంపై ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఇక వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కావడంపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైస్ సభ దృష్టికి తెచ్చారు. అయితే వక్ఫ్, దేవాదాయ భూములు ఇక నుంచి రిజిస్ట్రేషన్ కాకుండా ధరణి పోర్టల్లో ఆటో లాక్ అవుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







