ప్రజలలో భయాన్ని కల్గిస్తూ పుకార్ల ఫోన్లు చేసేవారిపై తీవ్ర చర్యలు

- February 10, 2016 , by Maagulf
ప్రజలలో భయాన్ని కల్గిస్తూ పుకార్ల ఫోన్లు చేసేవారిపై తీవ్ర చర్యలు

 బహ్రెయిన్ లో ప్రజాజీవన క్రమాన్ని అంతరాయం కల్గిస్తూ, లేనిపోని పుకార్లను అవాస్తవాలను ఫోన్ కాల్స్ ద్వారా  తెలియచేస్తూ భయాన్ని కల్గించే వారిపై పోలీసులు చట్టపరమైన కటినచర్యలు తీసుకోనున్నారు. నేషనల్ ఏక్షన్ చార్టర్ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ప్రజాభద్రతా విభాగం ముఖ్యాఢికారి మేజర్ జనెరల్ తారిక్ అల్ హస్సన్ ఈ ప్రకటనను చేశారు. సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి దేశస్థిరత్వాన్ని కలవరపరచే వ్యక్తులపై వారి ఫొనె పుకార్లను ఉపెక్షెంచబొమని అన్నారు.బహ్రెయిన్ పోలీసులు ఇప్పటికే..వివిధ ఫోన్ కాల్స్ పై పర్యవేక్షణ జరుపుతున్నారని తెలిపారు. వారు ప్రజాభద్రతపై అత్యధిక సమయాన్ని కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి పుకార్లను వ్యాపింప చేసేవారి గూర్చిన ఏదైనా ముఖ్య సమాచారం ప్రజలలో ఎవరి దగ్గరైనా ఉంటె, వారు ఆ వ్యక్తిని గూర్చి ఈ దిగువన ఇస్తున్న "  80008008 "  ఫొనె నెంబర్ కు తప్పక  తెలియచేయాలని...అయెతే, ఈ   సమాచారం ఇచ్చినవారి వివరాలను  పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచుతారని ఆయన తెలిపారు.
                        

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com