యూఏఈ అధ్యక్షతన సమావేశమైన జీసీసీ దేశాల ట్రాఫిక్ విభాగాలు
- September 11, 2020
యూఏఈ:గల్ఫ్ సహాకార మండలి సభ్య దేశాల్లో ట్రాఫిక్ సెఫ్టీకి సంబంధించి వ్యూహాత్మక ప్రణాళిక అమలుపై ఆయా సభ్యదేశాల ట్రాఫిక్ డీజీలు చర్చించారు. యూఏఈ అధ్యక్షతన జరిగిన 36వ సమావేశంలో పాల్గొన్న డీజీలు...ట్రాఫిక్ సమస్యలు, మెరుగైన సేవలకు సంబంధించి గల్ఫ్ దేశాల మధ్య పరస్పర సహాకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన చర్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా ప్రస్తుత కరోనా నేపథ్యంలో తమ ట్రాఫిక్ విభాగానికి సంబంధించి వైరస్ విస్తరించకుండా ఎలాంటి మార్గాలను అవలంభించాలనేది డిస్కస్ చేశారు. జీసీసీ దేశాలు పరస్పర సంబంధాలను మరింత మెరుగుపరుకోవటం, పలు వైపుల నుంచి వస్తున్న సరైన సలహాలను అమలు చేయటం ద్వారా జీసీసీ దేశాధినేతలు, ప్రజల అకాంక్షలను అందుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇందుకు జీసీసీ దేశాల అన్ని ట్రాఫిక్ విభాగాలకు సంబంధించి యూనిఫైడ్ ఎలక్ట్రానిక్ పోర్టల్ ద్వారా ఏకీకృత డేటా బేస్ సమాచారాన్ని సభ్య దేశాలు పరస్పరం పంచుకోవాలని, ఏకీకృత డేటా బేస్ పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. దీంతో ట్రాఫిక్ ఉల్లంఘన కేసులను మరింత సమర్ధవంతంగా ఎదుర్కొవచ్చని సమావేశంలో పాల్గొన్న ట్రాఫిక్ అధికారులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!