యూఏఈ అధ్యక్షతన సమావేశమైన జీసీసీ దేశాల ట్రాఫిక్ విభాగాలు
- September 11, 2020
యూఏఈ:గల్ఫ్ సహాకార మండలి సభ్య దేశాల్లో ట్రాఫిక్ సెఫ్టీకి సంబంధించి వ్యూహాత్మక ప్రణాళిక అమలుపై ఆయా సభ్యదేశాల ట్రాఫిక్ డీజీలు చర్చించారు. యూఏఈ అధ్యక్షతన జరిగిన 36వ సమావేశంలో పాల్గొన్న డీజీలు...ట్రాఫిక్ సమస్యలు, మెరుగైన సేవలకు సంబంధించి గల్ఫ్ దేశాల మధ్య పరస్పర సహాకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన చర్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా ప్రస్తుత కరోనా నేపథ్యంలో తమ ట్రాఫిక్ విభాగానికి సంబంధించి వైరస్ విస్తరించకుండా ఎలాంటి మార్గాలను అవలంభించాలనేది డిస్కస్ చేశారు. జీసీసీ దేశాలు పరస్పర సంబంధాలను మరింత మెరుగుపరుకోవటం, పలు వైపుల నుంచి వస్తున్న సరైన సలహాలను అమలు చేయటం ద్వారా జీసీసీ దేశాధినేతలు, ప్రజల అకాంక్షలను అందుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇందుకు జీసీసీ దేశాల అన్ని ట్రాఫిక్ విభాగాలకు సంబంధించి యూనిఫైడ్ ఎలక్ట్రానిక్ పోర్టల్ ద్వారా ఏకీకృత డేటా బేస్ సమాచారాన్ని సభ్య దేశాలు పరస్పరం పంచుకోవాలని, ఏకీకృత డేటా బేస్ పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. దీంతో ట్రాఫిక్ ఉల్లంఘన కేసులను మరింత సమర్ధవంతంగా ఎదుర్కొవచ్చని సమావేశంలో పాల్గొన్న ట్రాఫిక్ అధికారులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







