ఖతార్ లో కొత్తగా 235 కరోనా కేసులు..వైరస్ నుంచి 211 మంది రికవరి
- September 11, 2020
దోహా:ఖతార్ లో కోవిడ్ 19 తీవ్రత కొనసాగుతోంది. ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం సుల్తానేట్ లో కొత్తగా 235 మందికి కరోనా వైరస్ సోకింది. ఇందులో 8 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన వారి సంఖ్య 1,21,287కి చేరింది. మరోవైపు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. 24 గంటల్లో మరో 211 మంది వైరస్ నుంచి పూర్తిగా రికవరి అయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు 1,21,287 మందికి వైరస్ సోకితే 1,18,199 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక సుల్తానేట్ పరిధిలో ప్రస్తుతం 2883 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇందులో 50 మందికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ ప్రబలిన నాటి నుంచి ఇప్పటివరకు 205 మంది మరణించారు. ఇదిలాఉంటే..కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు విధించిన ఆంక్షలను క్రమంగా సడలిస్తున్న నేపథ్యంలో ప్రజలు అందరు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని, జనసమర్ధ ప్రాంతాల్లో ఉండకూడదని సూచించారు. ఫేస్ మాస్క్ ధరించటంతో పాటు తరచుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!