విజిట్‌ వీసా గడువు తీరినా,యూఏఈలో వుండిపోయేవారికి జరీమానా

- September 12, 2020 , by Maagulf
విజిట్‌ వీసా గడువు తీరినా,యూఏఈలో వుండిపోయేవారికి జరీమానా

యూఏఈ:విజిటర్స్‌ లేదా టూరిస్టులు, మార్చి 1 తర్వాత వీసా గడువు తీరిపోయినప్పటికీ ఇంకా దేశంలోనే వుండిపోతే భారీ జరీమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సెప్టెంబర్‌ 11 నుంచి జరీమానాలు ప్రారంభమవుతాయి. ఓవర్‌స్టే జరీమానా తొలి రోజుకి 200 దిర్హాములు వుంటుందని అమెర్‌ సెల్‌ సెంటర్‌ ఏజెంట్‌ పేర్కొన్నారు. ఎయిర్‌ పోర్టుల వద్ద ఇమ్మిగ్రేషన్‌ అథారిటీస్‌ ఈ మొత్తాన్ని లెక్కిస్తారు. ప్రతి అదనపు రోజుకీ 100 దిర్హాములు అలాగే సర్వీస్‌ ఫీజు కింద 1000 దిర్హాములు వసూలు చేయడం జరుగుతుంది. ఆగస్ట్‌ 11న నెల రోజులపాటు గడువు పొడిగించగా, అది సెప్టెంబర్‌ 11తో ముగిసింది. ఎలాంటి అదనపు పొడిగింపూ ఇకపై వుండదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. విజిట్‌ వీసా వున్నవారు తమ స్టేటస్‌ని మార్చుకోవాలి లేదంటే, దేశం విడిచి వెళ్ళాల్సిందిగా అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com