దుబాయ్ లో నిజాయితీ చాటిన భారతీయుడు..
- September 13, 2020
దుబాయ్:దుబాయ్ లో ప్రవాస భారతీయుడి ఒకరు తన నిజాయితీని చాటారు.తనకు దొరికిన బ్యాగులో 14,000$ డాలర్ల నగదు మరియు 200,000 దిర్హాముల విలువ చేసే బంగారు ఆభరణాలను భారత వ్యక్తి తీసుకెళ్లి దుబాయ్ పోలీసులకు అప్పగించారు.భారత్కు చెందిన రిచ్ జేమ్స్ కమల్ కుమార్ తన నిజాయితీని చాటుకున్నారు.తనకు దొరికిన లక్షల రూపాయలు కలిగి ఉన్న బ్యాగును అల్ కుశైస్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.ఎంతో నిజాయితీగా తనకు దొరికిన బ్యాగును తెచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించినందుకు శనివారం ఆయనను అల్ కుశైస్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ యూసుఫ్ అబ్దుల్లాహ్ సలీమ్ అల్ అదిది సన్మానించారు.ఈ సంధర్భంగా కుమార్కు పోలీస్ అధికారులు ప్రత్యేక ప్రశంస పత్రాన్ని అందజేశారు.తనకు దక్కిన ఈ ప్రత్యేక గుర్తింపు పట్ల దుబాయ్ పోలీసులకు కమల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది తనకు గర్వకారణమని అన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు