ప్రవాసీయులకు అనుమతిపై స్పష్టత ఇచ్చిన బహ్రెయిన్ ప్రభుత్వం

- September 13, 2020 , by Maagulf
ప్రవాసీయులకు అనుమతిపై స్పష్టత ఇచ్చిన బహ్రెయిన్ ప్రభుత్వం

మనామా:కరోనా కారణంగా పలు దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసీయులకు బహ్రెయిన్ అనుమతి ఇచ్చిదంటూ జరుగుతున్నతున్న ప్రచారాన్ని ఆ దేశ ప్రభుత్వం కొట్టిపారేసింది. పలు దేశాల నుంచి వచ్చే వలస కార్మికులకు అనుమతి ఇచ్చినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిరాధారమైనదని బహ్రెయిన్ జాతీయత, పాస్ పోర్ట్స్, నివాసిత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విదేశీ ప్రయాణాలు, విదేశాల నుంచి వచ్చే వారికి సంబంధించి గతంలో ప్రకటించిన నిబంధనలే ఇంకా అమలులో ఉన్నాయనే విషయాన్ని ప్రజలు గుర్తు ఉంచుకోవాలని వెల్లడించింది. ఇదిలాఉంటే..బహ్రెయిన్ ప్రభుత్వం ఇటీవలె ప్రకటించిన వివరాల మేరకు ఖతార్ మినహా జీసీసీ సభ్య దేశాలకు మాత్రమే అనుమతి ఉంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com