విమాన ప్రయాణాలకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన ఒమన్ ప్రభుత్వం
- September 13, 2020
మస్కట్:ఒమన్ కు వచ్చే ప్రయాణికులు అందరూ ఖచ్చితంగా ఆరోగ్య బీమా తీసుకోవాలని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఒమన్ లో అడుగుపెట్టిన నాటి నుంచి కనీసం నెల రోజుల పాటైనా ఇన్సూరెన్స్ గడువు ఉండాలని స్పష్టం చేసింది. అక్టోబర్ 1 నుంచి అంతర్జాతీయ విమానాలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఒమన్ పౌర విమానయాన అధికారులు ఈ మేరకు కొత్తగా మార్గనిర్దేశకాలను జారీ చేశారు. ఒమన్ కు చేరుకోగానే ప్రతి ప్రయాణికుడు విధిగా ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని, ఆ తర్వాత 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుందని తెలిపారు. ఈ 14 రోజులు ఎలక్ట్రానిక్ బ్రాస్లెట్ ధరించాల్సి ఉంటుంది. ఇక క్వారంటైన్ లో ఉండాల్సిన 14 రోజులకు సంబంధించి నివాస ఖర్చులను సదరు ప్రయాణికులే భరించాలి. అందుకు అనుగుణంగా హోటల్ బుకింగ్ వివరాలను కూడా తెలియజేయాలి. అలాగే సుల్తానేట్ కు వచ్చే ఒమనేతరులు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే కరోనా వైరస్ నేపథ్యంలో ఒమన్ నుంచి విదేశాలకు బయల్దేరే ప్రయాణికులకు సంబంధించి కూడా మార్గనిర్దేశకాలను విడుదల చేసింది. విదేశీ ప్రయాణికుడికి ఒక్క సహాకుడిని మాత్రమే డిపార్చర్ టెర్మినల్ లోకి అనుమతిస్తారు. విమానం బయల్దేరే సమయానికి కనీసం మూడు, నాలుగు గంటల ముందే విమానాశ్రయం చేరుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వారిని విమానాశ్రయంలోకి అనుమతించబోమని కూడా పౌర విమానయాన అధికారులు స్పష్టం చేశారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన







