భాగ్యనగరంలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
- September 14, 2020హైదరాబాద్ : హైదరాబాద్ లో రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నయా మోసం వెలుగులోకి వచ్చింది.హైదరాబాద్లో ఇప్పుడు కొందరు దుండగులు నయా మోసాలకు పాల్పడుతున్నారు. ఫేస్బుక్లో ఉన్న పోలీసు, ప్రభుత్వ అధికారుల ప్రొఫైల్ ఫొటోల తీసుకుని ఆ ఫొటోలతో నకిలీ ఖాతాలు ఓపెన్ చేసి కొందరు దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఈ ఫొటోలతో స్నేహితులకు మనీ అర్జంట్గా ఉందంటూ మెసేజ్లు చేసి మోసం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొంతమంది పోలీసులు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలా ఎవరికైనా గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి డబ్బులు పంపించాలని కోరితే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఎంక్వయిరీ చేసుకోవాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం