అక్టోబర్ 16న బతుకమ్మ పండుగ ప్రారంభం:కల్వకుంట్ల కవిత
- September 15, 2020హైదరాబాద్:అక్టోబర్ 16 నుండి 24 వరకు బతుకమ్మ పండుగను జరుపుకోవాలని సూచించిన మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బతుకమ్మ పండుగ తేదీలపై మాజీ ఎంపీ కవితను కలసిన ‘తెలంగాణ విద్వత్సభ’ ఆధ్వర్యంలోని సిద్ధాంతులు, పండితులు అధిక ఈశ్వీయుజ మాసం కారణంగా శాస్త్ర ప్రకారం పండుగ తేదీల్లో మార్పు.
ఈ ఏడాది బతుకమ్మ పండుగను అక్టోబర్ 16 నుండి 24 తేదీ వరకు జరుపుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సూచించారు. బతుకమ్మ పండుగ జరుపుకునే తేదీలపై ప్రముఖ సిద్ధాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష పండితులతో కూడిన ‘తెలంగాణ విద్వత్సభ’తో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చర్చించారు.
అధిక ఈశ్వీయుజ మాసం కారణంగా శ్రీ శార్వరి నామ సంవత్సరం లో వచ్చే బతుకమ్మ పండుగ తేదీలపై ఉన్న అస్పష్టతలను తొలగించేందుకు గాను, ‘తెలంగాణ విద్వత్సభ’ ప్రతినిధులు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను కలిసి, పండుగ తేదీలపై చర్చించారు. అంతకంటే ముందు ‘తెలంగాణ విద్వత్సభ’ ఆధ్వర్యంలోని 32 మంది సిద్ధాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష పండితులు , పండుగ తేదీలపై ఆన్ లైన్ సమావేశం నిర్వహించారు.
ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణాకే తలమాణికంగా నిలిచిందని మాజీ ఎంపీ కవిత గుర్తు చేశారు. ఈ సంవత్సరం అధిక మాసం రావడం వల్ల పండుగ తేదీలపై కొంత సందేహాలు ఉన్నాయన్నారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. ‘తెలంగాణ విద్వత్సభ’ ఆధ్వర్యంలో పండితుంతా చర్చించి ఈ సంవత్సరం పండగ తేదీలను శాస్త్ర ప్రకారం నిర్ణయించారని మాజీ ఎంపీ కవిత పేర్కొన్నారు. ఈ సంవత్సరం అధిక మాసాన్ని పరిగణలోకి తీసుకని, ప్రతి సంవత్సరం లాగ బాధ్రపద మాసంలో కాకుండా, అశ్వయుజ మాసంలో( అక్టోబర్) 16 వ తేదీన బతుకమ్మను ప్రారంభించి, తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించాలన్నారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత.
బాధ్రపద మాసంలో వచ్చే ఎంగిలిపూల అమావాస్య రోజు బతుకమ్మను ప్రారంభించాలని కొంతమంది ప్రతిపాదనలు చేశారన్నారు మాజీ ఎంపీ కవిత. 'మొదటి రోజు చేసుకునే గౌరమ్మకు, నెలరోజుల పాటు పూజలు చేసుకుని, అక్టోబర్ లో వచ్చే దుర్గాష్టమి రోజు వరకు బతుకమ్మ పండుగను జరుపుకోవచ్చు. అయితే బతుకమ్మను ప్రారంభించి, పూజలు చేయకపోవడం సరైనది కాదని వేదపండితులు తెలిపార'న్నారు మాజీ ఎంపీ కవిత. తెలంగాణ జాగృతి చాలా సంవత్సరాల నుండి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నందున, చాలా మంది బతుకమ్మ తేదీల గురించి తనను సంప్రదించారని మాజీ ఎంపీ కవిత పేర్కొన్నారు. దీంతో ‘తెలంగాణ విద్వత్సభ’ సలహా మేరకు అక్టోబర్ 16 తేదీన బతుకమ్మ పండుగను ప్రారంభించి, అక్టోబర్ 24 తేదీ వరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ కవిత తెలిపారు. ప్రతి 19 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి పరిస్థితి ఎదురౌతుందని, శాస్త్ర ప్రకారం ఇందులో ఎలాంటి తప్పు లేదని వేద పండితులు తెలిపారని మాజీ ఎంపీ కవిత అన్నారు.పండితులు, సిద్ధాంతుల సూచనల ప్రకారం అక్టోబర్ 16 న బతుకమ్మను ప్రారంభించాలని తెలంగాణ ఆడపడుచులను మాజీ ఎంపీ కవిత కోరారు.
‘తెలంగాణ విద్వత్సభ’ రాష్ట్ర అధ్యక్షులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి, తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవాసంఘాల సమాఖ్య అధ్యక్షులు వెన్నంపల్లి జగన్మోహన శర్మ, ఇతర పండితులు, మాజీ ఎంపీ కవితను కలిసారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు