కరోనా మందు వచ్చేసింది..'అత్యవసర ఆమోదం' తెలిపిన యూఏఈ...కానీ ముందు వారికేనట!
- September 15, 2020యూఏఈ:యూఏఈ లో పరీక్షింపబడుతున్న కరోనా వ్యాక్సిన్ ను వాడేందుకు “అత్యవసర ఆమోదం” ప్రకటించినట్టు యూఏఈ ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ మంత్రి అబ్దుల్ రెహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ ఓవైస్ అన్నారు. మొదటి మరియు రెండవ పరీక్ష దశల టీకా ఫలితాలు సురక్షితమైన, సమర్థవంతమైన మరియు సరైన ప్రతిస్పందనను అందించినందున ఈ ఆమోదం తెలిపినట్టు ఓవైస్ వివరించారు.వైరస్ బారిన పడే ప్రమాదం ఉన్న ఫ్రంట్లైన్ కార్మికులకు ఈ టీకా అందుబాటులో ఉంటుందని మంత్రి ప్రకటించారు. ఇది వారిని ప్రమాదాల నుండి రక్షిస్తుంది.
"దశ III యొక్క చివరి దశలలో టీకా అధ్యయనాల ఫలితాలు ప్రభావవంతంగా ఉండటమేకాకుండా బలమైన ప్రతిస్పందనకు కారణమయింది. వైరస్కు ప్రతిరోధకాలను సైతం ఉత్పత్తి చేస్తోంది. టీకా భద్రతపై అధ్యయనాలు సానుకూలం మరియు సురక్షితం అని తేలింది” అని అల్ ఓవైస్ అన్నారు.
"క్లినికల్ ట్రయల్స్ సరైన మార్గంలో పయనిస్తున్నాయి, ఇప్పటివరకు అన్ని పరీక్షలు విజయవంతమయ్యాయి" అని కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ నవాల్ అల్ కాబీ అన్నారు. "అధ్యయనం ప్రారంభమైన ఆరు వారాలలోపు 31,000 మంది వాలంటీర్లు క్లినికల్ ట్రయల్స్లో పాల్గొన్నారు. ఇప్పటివరకు నివేదించబడిన దుష్ప్రభావాలు ఇతర టీకా మాదిరిగా తేలికపాటి మరియు ఊహించినవే; తీవ్రమైన దుష్ప్రభావాలు ఏవీ ఎదుర్కోలేదు. శరీరంలో యాంటీబాడీ ఉత్పత్తి పరంగా ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. అంతేకాకుండా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 1,000 మంది వాలంటీర్లపై ఈ టీకా పరీక్షించగా ఎటువంటి సమస్యలు తలెత్తకపోవటం ఏంటో సంతృప్తినిస్తోంది” అని ఆమె చెప్పారు.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్