ఏ.పి:అరుకులోయకు పర్యాటకులకు శుభవార్త
- September 15, 2020
ఏ.పి:అరుకులోయ ప్రియులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. విశాఖ నుంచి అరకులోయ వరకు గ్లాస్టాప్ కోచ్లను ప్రవేశపెడతామని తెలిపింది. ప్రస్తుతం ఒకటి మాత్రమే ఉన్న విస్టాడోమ్ కోచ్ల సంఖ్యను పెంచనున్నట్టు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డికి రైల్వే మంత్రి పియూష్ గోయల్ లేఖ రాశారు. రైల్యేశాఖ విశాఖ-అరకు రైలులో తీసుకొచ్చిన విస్టాడోమ్కు పర్యాటకుల నుంచి అభించిందని.. అయితే, విస్టాడోమ్ కోచ్ ఒక్కటే ఉండటతో రెండు నెలల ముందే రిజర్వేషన్ చేసుకోవలసిన పరిస్తితి ఏర్పడిందన విజయసాయి రెడ్డి గతంలో రైల్వేశాఖకు తెలిపారు. మరిన్న కోచ్ లు తీసుకొని వస్తే.. పర్యాటక రంగానికి బాగుంటుందని తెలిపారు. విజయసాయి చేసిన విజ్ఞప్తిపై రైల్వే మంత్రి పియూష్ గోయల్ సానుకూలంగా స్పందిస్తూ ఆయనకు లేఖ రాశారు. ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అరకు రైలుకు మరిన్ని విస్టాడోమ్ కోచ్లను జతచేయాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు గోయల్ తెలిపారు. ప్రస్తుతం విస్టాడోమ్ కోచ్లు తయారీలో ఉన్నాయని, త్వరలోనే వాటిని పర్యాటకులకు అందుబాటులోని తీసుకొని వస్తామని అన్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!