పర్యాటక రంగాన్ని చక్కదిద్దే చర్యలపై దృష్టి సారించిన బహ్రెయిన్
- September 17, 2020
బహ్రెయిన్: కోవిడ్ ధాటికి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్న పర్యాటక రంగాన్ని గాడిన పడేసేందుకు ఉన్న అవకాశాలపై బహ్రెయిన్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని అంతర్జాతీయ పర్యాటక సంస్థ 112వ సమావేశంలో పర్యాటక రంగానికి సంబంధించి పలు అంశాలను చర్చించారు. బహ్రెయిన్ పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక మంత్రితో పాటు పర్యాటక, ఎగ్జిబిషన్ అధారిటీ(BTEA) నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో తబ్లిషి తీర్మానంలో భాగమైన పర్యాటక రంగం పునురుద్ధణతో పాటు ఏయే రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కోవిడ్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటూనే పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చే మార్గాలపై సమీక్షించారు. ఇదిలాఉంటే దేశీయంగానే కాకుండా మధ్య ప్రాచ్యంలో పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడే చర్యలు చేపట్టడంతో బహ్రెయిన్ ను గతేడాది UNWTOలో సభ్య దేశంగా చేర్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







