షార్జా: విస్తుపోయేలా మితిమీరుతున్న వేగం..రాడార్ లో 278కి.మీ. వేగం నమోదు
- September 17, 2020
షర్జాలోని వాహనదారుల మితిమీరిన వేగం విస్తుగొలిపేలా ఉంటున్నాయి. 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన రోడ్లపై ఏకంగా 200 కిలోమీటర్ల వేగం దాటి ప్రమాదకరంగా వహనాలను నడుపుతున్నారు. వేగ పరిమితికి సంబంధించి ఈ ఏడాది తొలి 8 నెలల్లోనే 274 ఉల్లంఘనలు స్పీడ్ రాడార్ లో నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఉల్లంఘనలు అన్ని జనవరి 1 నుంచి ఆగస్ట్ 31 మధ్య నమోదయ్యాయని వివరించారు. ఇక ఇటీవలె ఓ వహనదారుడు 80 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ ఉన్న రహదారిలో ఏకంగా 278 కిలోమీటర్లు వేగంతో దూసుకుపోయినట్లు రాడార్ లో నమోదైందని తెలిపారు. హద్దుమీరి వేగం అత్యంత ప్రమాదకరమని..అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. షార్జాలోని పలు ప్రాంతాల్లోని స్పీడ్ రాడార్స్...స్పీడ్ లిమిట్ దాటిన వాహనాలను గుర్తిస్తాయనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. 80 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ విధించిన రహదారిలో అంతకుమించి వేగంగా వెళ్లిన వాహనదారుడికి Dh3000జరిమానాతో పాటు 23 బ్లాక్ పాయింట్స్ విధిస్తామని, రెండు నెలల పాటు వాహనాన్ని జప్తు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఇక 60 కిలోమీటర్ల వేగ పరిమితిని దాటిన వాహనదారులకు Dh2000 జరిమానా, 12 బ్లాక్ పాయింట్లతో పాటు నెల రోజులు వాహనాన్ని జప్తు చేస్తామన్నారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







