రియాద్-లక్నో: భారీగా బంగారం పట్టివేత
- September 18, 2020
లక్నో:అక్రమ బంగారం రవాణాకు కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా అడ్డుకట్ట పడటం లేదు. ఏదో ఒక రూపంలో బంగారాన్ని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా భారీగా విదేశాల నుంచి బంగారాన్ని తరలిస్తుండగా డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా లక్నో కస్టమ్స్ అధికారులకు ఏకంగా రూ. 2 కోట్లు విలువ చేసే 3.8కిలోల బంగారం పట్టుబడింది. లక్నోలోని చౌదరీ చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఈ ఘటన జరిగింది. రియాద్ నుంచి లక్నో జీ8 6451 విమానంలో వచ్చాడు. అతడి కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు సోదా చేయగా, భారీ మొత్తంలో బంగారం దొరికింది. మొత్తం 33 గోల్డ్ బిస్కెట్లను ప్రయాణికుడి నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మొత్తం గోల్డ్ 3,849.12 గ్రాములని, మార్కెట్లో దీని విలువ సుమారు రూ. 2 కోట్ల 9 లక్షల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. కాగా, నిందితుడు గోల్డ్ బిస్కెట్లను సెల్లోటేప్లో చుట్టి, అతని అండర్ గార్మెంట్లోని నల్ల రంగు పర్సులో దాచి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!