రియాద్-లక్నో: భారీగా బంగారం పట్టివేత
- September 18, 2020
లక్నో:అక్రమ బంగారం రవాణాకు కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా అడ్డుకట్ట పడటం లేదు. ఏదో ఒక రూపంలో బంగారాన్ని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా భారీగా విదేశాల నుంచి బంగారాన్ని తరలిస్తుండగా డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా లక్నో కస్టమ్స్ అధికారులకు ఏకంగా రూ. 2 కోట్లు విలువ చేసే 3.8కిలోల బంగారం పట్టుబడింది. లక్నోలోని చౌదరీ చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఈ ఘటన జరిగింది. రియాద్ నుంచి లక్నో జీ8 6451 విమానంలో వచ్చాడు. అతడి కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు సోదా చేయగా, భారీ మొత్తంలో బంగారం దొరికింది. మొత్తం 33 గోల్డ్ బిస్కెట్లను ప్రయాణికుడి నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మొత్తం గోల్డ్ 3,849.12 గ్రాములని, మార్కెట్లో దీని విలువ సుమారు రూ. 2 కోట్ల 9 లక్షల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. కాగా, నిందితుడు గోల్డ్ బిస్కెట్లను సెల్లోటేప్లో చుట్టి, అతని అండర్ గార్మెంట్లోని నల్ల రంగు పర్సులో దాచి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు.

తాజా వార్తలు
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!







