త్రీడీ ప్రింట్ ద్వారా దుబాయ్ మెట్రో విడి పరికరాలు ఆవిష్కరించిన ఆర్టీఏ

- September 19, 2020 , by Maagulf
త్రీడీ ప్రింట్ ద్వారా దుబాయ్ మెట్రో విడి పరికరాలు ఆవిష్కరించిన ఆర్టీఏ

దుబాయ్: అసలే కరోనా క్లిష్ట పరిస్థితులు. ఈ సమయంలో పారిశ్రామిక ఉత్పత్తుల సామర్ధ్యం అతంత మాత్రంగానే ఉంటోంది. ఒకవేళ ఉత్పత్తి ఉన్నా..వాటి తయారీ ఖరీదు గతంలో కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయితే..ఈ అవరోధాలన్నింటికి సమాధానంగా దుబాయ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ అందుబాటులో ఉన్న టెక్నాలజీని అందిపుంచుకుంటోంది. ఏకంగా దుబాయ్ మెట్రోకు కావాల్సిన విడి బాగాలను త్రీడీ ప్రింట్ ద్వారా రూపొందిస్తూ మెట్రో సమస్యకు పరిష్కారం చూపించింది. అంతేకాదు గతంలో విడిభాగాలు తయారు చేసిన సమయంతో పోలిస్తే త్రీడీ ప్రింట్ ద్వారా 90 శాతం సమయాన్ని ఆదా చేస్తోంది. దుబాయ్ మెట్రో నిర్వహణ కాంట్రాక్ట్ సంస్థ సెర్కొతో కలిసి విడి భాగాల తయారీ విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఆర్టీఏ అనుసరిస్తున్న త్రీడీ ప్రింట్ టెక్నాలజీకి సంబంధించి చిన్న వీడియో క్లిప్ ను తమ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు అధికారులు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com