నిరుద్యోగ యువతకు గాలం వేసిన ముఠాని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీస్
- September 19, 2020
హైదరాబాద్:AMC కంపెనీ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ఓ ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వందల సంఖ్యలో బాధితులున్నట్టు పోలీసులు గుర్తించారు. తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం నుంచి అందేలా చూస్తామని... జనాలను ముఠా సభ్యులు మభ్యపెట్టారు. దీనికోసం ముందుగా నిరుద్యోగ యువతకు గాలం వేసి రిక్రూట్మెంట్ చేసుకున్నారు. దాదాపు 2 కోట్ల రూపాయల మేర మోసం జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీనికి సంబంధించి యూపీకి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక్కొక్కరి వద్ద నుంచి 50 వేల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. లక్నో కేంద్రంగా జాబ్ ఫ్రాడ్ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. నౌకరీ వెబ్సైట్ నుంచి రెజ్యూమ్లను తీసుకుని.. కెరీర్ స్టైల్ పేరుతో నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేశారు. అలా హైదరాబాద్ యువతకు గాలం వేశారని సీపీ సజ్జనార్ తెలిపారు.



తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







