విమానాల్ని పునరుద్ధరించనున్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌

- September 19, 2020 , by Maagulf
విమానాల్ని పునరుద్ధరించనున్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌

దుబాయ్‌:దుబాయ్‌ నుంచి అలాగే దుబాయ్‌కి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలపై దుబాయ్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ నిషేధం విధించినప్పటికీ, షెడ్యూల్స్‌ ప్రకారమే తమ విమానాలు నడుస్తాయని ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇద్దరు ప్రయాణీకులు ఎయిర్‌ ఇండియా విమానాల ద్వారా యూఏఈకి తమ వెంట కరోనాని తీసుకువచ్చిన దరిమిలా, దుబాయ్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ, విమాన సర్వీసుల్ని తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆపరేట్‌ అవ్వాల్సిన విమానాలు షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆపరేట్‌ కానున్నాయి. రీషెడ్యూల్‌ అయిన విమానాలు కాలికట్‌, తిరువనంతపురం, ముంబై మరియు కన్నూర్‌లకు చేరుకోనున్నాయి. శుక్రవారం విమానాలు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఆపరేట్‌ అయ్యాయని ఎయిర్‌లైన్‌ అఫీషియల్‌ ఒకరు చెప్పారు.

--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com