విమానాల్ని పునరుద్ధరించనున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్
- September 19, 2020
దుబాయ్:దుబాయ్ నుంచి అలాగే దుబాయ్కి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలపై దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ నిషేధం విధించినప్పటికీ, షెడ్యూల్స్ ప్రకారమే తమ విమానాలు నడుస్తాయని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇద్దరు ప్రయాణీకులు ఎయిర్ ఇండియా విమానాల ద్వారా యూఏఈకి తమ వెంట కరోనాని తీసుకువచ్చిన దరిమిలా, దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ, విమాన సర్వీసుల్ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆపరేట్ అవ్వాల్సిన విమానాలు షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆపరేట్ కానున్నాయి. రీషెడ్యూల్ అయిన విమానాలు కాలికట్, తిరువనంతపురం, ముంబై మరియు కన్నూర్లకు చేరుకోనున్నాయి. శుక్రవారం విమానాలు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఆపరేట్ అయ్యాయని ఎయిర్లైన్ అఫీషియల్ ఒకరు చెప్పారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన