ఇండియన్ ప్రీమియర్ లీగ్కి అంతా సిద్ధం
- September 19, 2020
అబుధాబి:మరికొద్ది గంటల్లో అంగరంగ వైభవంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ప్రారంభం కాబోతోంది. కరోనా నేపథ్యంలో ఇండియా నుంచి ఐపీఎల్ వేదిక యూఏఈకి మారిన విషయం విదితమే. రానున్న 52 రోజులు క్రికెట్ అభిమానుల్ని నరాలు తెగే ఉత్కంఠతో ఐపీఎల్ పోటీలు అలరించనున్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి పోరు ఈ సీజన్లో జరగనుంది. అంతర్జాతీయ క్రికెట్కి గుడ్ బై చెప్పిన క్రికెటర్ ధోనీ, ఈ ఐపీఎల్ ద్వారా తన అభిమానుల్ని అలరించబోతున్నాడు. యూఏఈలోని దుబాయ్, అబుదాబీ మరియు షార్జాలలో క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఇండియన్ క్రికెటర్స్తోపాటు వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లకూ యూఏఈ రెండో హోం గ్రౌండ్ అనే అభిప్రాయం క్రికెట్ విశ్లేషకుల్లో వుంది. అయితే, స్టేడియంలలో ఇదివరకటిలా అభిమానుల కోలాహలం లేకపోవడంతో ఈ మ్యాచ్లు ఎలా క్రికెట్ అభిమానుల్ని అలరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







