ఇండియన్ ప్రీమియర్ లీగ్కి అంతా సిద్ధం
- September 19, 2020
అబుధాబి:మరికొద్ది గంటల్లో అంగరంగ వైభవంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ప్రారంభం కాబోతోంది. కరోనా నేపథ్యంలో ఇండియా నుంచి ఐపీఎల్ వేదిక యూఏఈకి మారిన విషయం విదితమే. రానున్న 52 రోజులు క్రికెట్ అభిమానుల్ని నరాలు తెగే ఉత్కంఠతో ఐపీఎల్ పోటీలు అలరించనున్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి పోరు ఈ సీజన్లో జరగనుంది. అంతర్జాతీయ క్రికెట్కి గుడ్ బై చెప్పిన క్రికెటర్ ధోనీ, ఈ ఐపీఎల్ ద్వారా తన అభిమానుల్ని అలరించబోతున్నాడు. యూఏఈలోని దుబాయ్, అబుదాబీ మరియు షార్జాలలో క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఇండియన్ క్రికెటర్స్తోపాటు వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లకూ యూఏఈ రెండో హోం గ్రౌండ్ అనే అభిప్రాయం క్రికెట్ విశ్లేషకుల్లో వుంది. అయితే, స్టేడియంలలో ఇదివరకటిలా అభిమానుల కోలాహలం లేకపోవడంతో ఈ మ్యాచ్లు ఎలా క్రికెట్ అభిమానుల్ని అలరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







