ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కి అంతా సిద్ధం

- September 19, 2020 , by Maagulf
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కి అంతా సిద్ధం

అబుధాబి:మరికొద్ది గంటల్లో అంగరంగ వైభవంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2020 ప్రారంభం కాబోతోంది. కరోనా నేపథ్యంలో ఇండియా నుంచి ఐపీఎల్‌ వేదిక యూఏఈకి మారిన విషయం విదితమే. రానున్న 52 రోజులు క్రికెట్‌ అభిమానుల్ని నరాలు తెగే ఉత్కంఠతో ఐపీఎల్‌ పోటీలు అలరించనున్నాయి. ముంబై ఇండియన్స్‌, చెన్నయ్‌ సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య తొలి పోరు ఈ సీజన్‌లో జరగనుంది. అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పిన క్రికెటర్‌ ధోనీ, ఈ ఐపీఎల్‌ ద్వారా తన అభిమానుల్ని అలరించబోతున్నాడు. యూఏఈలోని దుబాయ్‌, అబుదాబీ మరియు షార్జాలలో క్రికెట్‌ పోటీలు జరగనున్నాయి. ఇండియన్‌ క్రికెటర్స్‌తోపాటు వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లకూ యూఏఈ రెండో హోం గ్రౌండ్‌ అనే అభిప్రాయం క్రికెట్‌ విశ్లేషకుల్లో వుంది. అయితే, స్టేడియంలలో ఇదివరకటిలా అభిమానుల కోలాహలం లేకపోవడంతో ఈ మ్యాచ్‌లు ఎలా క్రికెట్‌ అభిమానుల్ని అలరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com