పబ్లిక్‌ స్కూల్‌ షెడ్యూల్‌ని ప్రకటించిన మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌

- September 19, 2020 , by Maagulf
పబ్లిక్‌ స్కూల్‌ షెడ్యూల్‌ని ప్రకటించిన మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌

కువైట్‌ సిటీ: మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఇ-లెర్నింగ్‌ కమిటీ, ఇ-లెర్నింగ్‌ షెడ్యూల్‌ని పబ్లిక్‌ స్కూల్‌ స్టూడెంట్స్‌ కోసం ప్రకటించింది. అన్ని క్లాసెస్‌, ఆన్‌లైన్‌ ద్వారా రియల్‌ టైవ్‌ులో కనెక్ట్‌ అవుతాయి స్టూడెంట్స్‌తో. నాలుగవ గ్రేడ్‌ మరియు ఆ పైన గ్రేడ్స్‌కి ఇది వర్తిస్తుంది. కిండర్‌గార్టెన్స్‌ నుంచి మూడవ గ్రేడ్‌ వరకు, ప్రి-రికార్డెడ్‌ మెథడ్‌లో అందిస్తారు. నాలుగు, ఐదు గ్రేడ్స్‌కి ఆన్‌లైన్‌ క్లాస్‌లు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఆరవ గ్రేడ్‌ నుంచి ఎనిమిదవ గ్రేడ్‌ విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి 10.30 నిమిషాల వరకు క్లాసులు జరుగుతాయి. హైస్కూల్‌ స్టూడెంట్స్‌ ఉదయం 10.40 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు క్లాసులకు అటెండ్‌ అవ్వాల్సి వుంటుంది. కాగా, అక్టోబర్‌ 4న స్కూల్స్‌ ఓపెన్‌ అయ్యే అవకాశాలున్నాయి. మార్చి 12న స్కూల్స్‌ కరోనా నేపథ్యంలో సస్పెండ్‌ చేయబడ్డాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com