కువైట్:క్వారంటైన్ గడువును 7 రోజులకు కుదించాలని ప్రతిపాదించిన డీజీసీఏ
- September 21, 2020కువైట్ సిటీ:కువైట్ లో క్వారంటైన్ గడువు ఇక నుంచి ఏడు రోజులే ఉండే అవకాశాలున్నాయి. విమాన ప్రయాణికుల క్వారంటైన్ కాలపరిమితిని 7 రోజులకు తగ్గించాలని కువైట్ పౌర విమానయాన సంస్థ ప్రతిపాదించింది. ప్రస్తుతం కువైట్ చేరే విమాన ప్రయాణికులు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలనే నిబంధన అమలులో ఉంది. అయితే..ఈ సమాయాన్ని సగం రోజులకు తగ్గించాలన్నది డీజీసీఏ ప్రతిపాదన. అంతేకాదు..ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శికి, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులకు లేఖ రాసింది. ప్రస్తుతం అమలులో ఉన్న 14 రోజుల క్వారంటైన్ కాలపరిమితిని 7 రోజులకు కుదించాలని కోరింది. అయితే..ప్రయాణికులు అందరూ కోవిడ్ లేదని నిర్దారించే ఆర్టీ పీసీఆర్ నెగటీవ్ సర్టిఫికెట్ ను చూపించాల్సిందేనని పేర్కొంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం