ఈనెల 27న టీడీపీ రాష్ట్ర కమిటీ ప్రకటన..
- September 22, 2020
ఏపీ:ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై టీడీపీ కసరత్తు పూర్తి చేసింది. ఈనెల 27వ తేదీన కమిటీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈసారి ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారు. కళావెంకట్రావు స్థానంలో ఇకపై అచ్చెన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉంటారు. బీసీ సామాజికవర్గానికి చెందిన బలమైన నేతగా గుర్తింపు ఉన్న అచ్చెన్నకు సారథ్య బాధ్యతలు ఇవ్వడం ద్వారా పార్టీని మరింతగా బలోపేతం చెయ్యాలని జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భావిస్తున్నారు.
అలాగే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 25 మంది అధ్యక్షుల్ని నియమించనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాల ఏర్పాటు ఉండబోతున్న నేపథ్యంలోనే ఈసారి ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోకి వచ్చే ఆరేడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో చర్చించి, సుదీర్ఘ కసరత్తు చేశాక కొత్త అధ్యక్షుల్ని ఖరారు చేశారు. అలాగే పార్టీ అనుబంధ విభాగాలకు కూడా కొత్త వారిని నియమించనున్నారు. ఈసారి యువతకు ప్రాధాన్యం ఇచ్చేలా కమిటీల రూపకల్పన జరిగిందని టీడీపీ ముఖ్యనేతలు చెప్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన