రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి మృతి పట్ల ఎపి గవర్నర్ సంతాపం

- September 23, 2020 , by Maagulf
రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి మృతి పట్ల ఎపి గవర్నర్ సంతాపం

విజయవాడ, సెప్టెంబర్ 23: కరోనాకు చికిత్స పొందుతూ  రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి బుధవారం ఆకస్మికంగా మృతి చెందటం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషన్ హరిచందన్  తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ 2004 నుండి పార్లమెంటు సభ్యునిగా, 2019 నుండి రైల్వే శాఖ సహాయ మంత్రి గా పనిచేసిన సురేష్ అంగడి సేవలను కర్ణాటక ప్రజలు, దేశ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచు కుంటారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. గవర్నర్ హరిచందన్ దివంగత సురేష్ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సంతాపం తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com