సీసీటీవీ ప్రాజెక్టు హైదరాబాద్ పోలీసు నగర కమిషనర్ మహేందర్రెడ్డి ప్రారంభించారు
- February 11, 2016
భాగ్యనగరాన్ని విశ్వనగరంగా చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చే క్రమంలో నగరమంతా లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు హైదరాబాద్ పోలీసు నగర కమిషనర్ మహేందర్రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సీసీటీవీ ప్రాజెక్టును ఈరోజు ఆయన ప్రారంభించారు. పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోని టైటాన్ ఐ షోరూం నుంచి చింతల్ బస్తీ వరకు రెండున్నర కిలోమీటర్ల మేర రూ.22 లక్షలతో 36 సీసీ కెమెరాలు అమర్చారు. ఈ నగదును 43 మంది దాతలు విరాళంగా అందించినట్లు సీపీ చెప్పారు.ప్రజల భాగస్వామ్యంలో ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. నేరస్థులను పట్టుకోవడానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. నగరంలో ఇప్పటికే 15వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని... వచ్చే ఏడాది నాటికి లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని సీపీ తెలిపారు. నగరంలో ట్రాఫిక్ పోలీసు రహిత సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరలోనే ప్రవేశ పెడుతున్నట్లు మహేందర్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







