బహ్రెయిన్‌లో పర్యటిస్తున్న ఇజ్రాయెలీ అధికారిక బృందం

- September 24, 2020 , by Maagulf
బహ్రెయిన్‌లో పర్యటిస్తున్న ఇజ్రాయెలీ అధికారిక బృందం

మనామా:ఇజ్రాయెలీ డెలిగేషన్‌ బృందం, బహ్రెయిన్‌లో పర్యటిస్తోంది. బహ్రెయిన్‌ - ఇజ్రాయెల్‌ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెరిగే దిశగా ఈ టూర్‌లో ఇజ్రాయెల్‌ అధికారులు, బహ్రెయిన్‌ అదికారులతో చర్చలు జరుపుతున్నారు. క్యాపిటల్‌ మనామాలో ఈ సమావేశం జరిగింది. గత వారం అమెరికా సమక్షంలో యూఏఈ - బహ్రెయిన్‌, ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. వివిధ రంగాల్లో పరస్పర సహకారం దిశగా ఇప్పటికే ఇరు దేశాలూ చర్చించుకోవడం జరిగింది. బహ్రెయిన్‌ కింగ్‌ రిప్రెజెంటేటివ్‌ అలాగే సుప్రీం కౌన్సిల్‌ ఫర్‌ది ఎన్విరాన్‌మెంట్‌ అబ్దుల్లా బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా, ఇజ్రాయెల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ మినిస్టర్‌ జిలా జమ్లీతో ఫోన్‌లో పలు అంశాలపై చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com