రియాద్: మినహాయింపు వర్గాలకి ప్రయాణ అనుమతికి షరతులు
- September 27, 2020
రియాద్:కోవిడ్ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన ప్రస్తుత సమయంలో కొన్ని మినహాయింపు వర్గాలకు ప్రయాణ అనుమతులకు సంబంధించి షరతులను ప్రకటించింది పాస్ పోర్ట్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం. ప్రయాణ అనుమతికి అర్హులైన వారిలో తొలిగా పలు విభాగాల్లో అధికారిక కార్యాకలాపాల నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సి వచ్చిన వారు ప్రయోజనం పొందనున్నారు. అధికారులు తమకు నిర్దేశించిన విధులను వర్చువల్ విధానంలో, ఆన్ లైన్ ద్వారాగానీ చేయలేని పరిస్థితులు ఉన్నా..వ్యక్తిగతంగా తమ హాజరు తప్పరిసరి అయినా..ఆ విధులను నిర్ణీత సమయంలోనే పూర్తి చేయాల్సి ఉన్న వారికి ప్రయాణ అనుమతి
ఇవ్వనున్నారు. అలాగే సౌదీ జాతీయుల బంధువులు విదేశాల్లో ఉన్నట్లైతే..వాళ్లు కింగ్డమ్ వచ్చే పరిస్థితులు లేని సందర్భాల్లో ప్రయాణానికి అనుమతిస్తారు. అయితే..తమ బంధువులు విదేశాల్లో ఉన్నట్లు ఆధారాలు, వాళ్లు కింగ్డమ్ రాలేని పరిస్థితులను పాస్ పోర్ట్ అధికారులకు వివరించాల్సి ఉంటుంది. ఇక విదేశాల్లో ఉంటున్న సౌదీ పౌరులు, వారి మీద ఆధారపడే వారు ప్రయాణ అనుమతులకు సంబంధించి మినహాయింపు పొందే మూడో వర్గంలోకి వస్తారు. వారు విదేశాల్లో ఉంటున్నట్లు, ఏ దేశంలో ఉంటున్నారో ఆధారాలు చూపించి ప్రయాణ అనుమతి పొందవచ్చు.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం