గోవాలో పున:ప్రారంభమైన దిలీప్ రాజా ‘యూత్’ చిత్ర షూటింగ్
- September 27, 2020గోవా:బాపట్ల పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్ సమర్పణలో.. పెదరావురు ఫిల్మ్ సిటీ బ్యానర్పై.. అలీతో ‘పండుగాడి ఫొటో స్టూడియో’ వంటి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు దిలీప్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘యూత్’. ‘కుర్రాళ్ళ గుండె చప్పుడు’ అనేది ట్యాగ్లైన్. లాక్డౌన్ కారణంగా మార్చిలో ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ తిరిగి గోవాలో ప్రారంభించినట్లుగా దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. ‘‘గోవాలో ‘యూత్’ చిత్ర షూటింగ్ను పున: ప్రారంభించాము. ఈ షెడ్యూల్ తొమ్మిది రోజులు గోవాలోనే జరుగతుంది. రెండవ షెడ్యూల్ నవంబర్ 9 నుంచి రాజస్థాన్ ఎడారిలో చిత్రీకరిస్తాము. జనవరిలో చివరి షెడ్యూల్, క్లైమాక్స్ సన్నివేశాలను ఏపీలోని 13 జిల్లాలలో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నాము. 2021 ఏప్రిల్కు సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. ఆ సమయానికి కరోనాకు వ్యాక్సిన్ వస్తుందని, తిరిగి థియేటర్లకు ప్రేక్షకులు ఎలాంటి భయం లేకుండా వస్తారని ఆశిస్తున్నాము. ఈ గోవా షెడ్యూల్లో బీచ్ దగ్గర కొన్ని ఛేజింగ్ సన్నివేశాలు, అలాగే చిత్రంలోని కీలక సంఘటనలను చిత్రీకరించనున్నాము. ఈ సినిమా కథను, అలాగే ఇందులో నటించే నటీనటుల వివరాలను ప్రస్తుతానికి కాన్ఫిడెన్షియల్గానే ఉంచుతున్నాము. నవంబర్లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించి.. ఈ వివరాలను ప్రకటిస్తాము. యూత్ చిత్రమే కాకుండా ‘తను నేనూ ఒక్కటే’ అనే టైటిల్తో కూడా ఓ చిత్రం రూపొందించనున్నాము. ఈ టైటిల్కు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అనుమతి వచ్చింది. 2021లో ఈ చిత్రం మొదలవుతుంది..’’ అని తెలిపారు.
‘యూత్’ చిత్రానికి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: దిలీప్ రాజా.
తాజా వార్తలు
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..