మస్కట్: ఒకే రోజు ఐసీయూకి 200 మంది కోవిడ్ పేషెంట్లు
- September 27, 2020మస్కట్:ఒమన్ లో కరోనాతో ఐసీయూలో చేరిన వారి సంఖ్య తొలిసారిగా 200 దాటింది. దేశంలో తొలి కరోనా కేసు నమోదైన నాటి నుంచి ఇప్పటివరకు ఇంత ఎక్కువ స్థాయిలో ఐసీయూ పేషెంట్ల సంఖ్య నమోదవటం ఇదే మొదటిసారి. వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం 24 గంటల వ్యవధిలో 63 మంది ఐసీయూలో చేరారు. దీంతో ఐసీయూలో చేరిన పేషెంట్ల సంఖ్య 200 మందికి మించింది. ఐసీయూలో పేషెంట్ల సంఖ్య పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం అవుతున్నా..అది ఆస్పత్రి సిబ్బంది వైఫల్యంగా తాము భావించటం లేదని కోవిడ్ 19 సుప్రీమ్ కమిటీ సభ్యుడు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని..అదే తరహాలో దేశంలోనూ కేసులు పెరుగుతున్నాయని, వైద్య సిబ్బంది తమ శక్తివంచన లేకుండా సేవలు అందిస్తోందన్నారు. ఇదిలాఉంటే..ఒమన్ లో కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. ఇప్పటివరకు దేశంలో 97,450 కరోనా కేసులు నమోదయ్యాయి. 87,801 మంది కోలుకున్నారు. 909 మంది వైరస్ తో మృతి చెందారు.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA