'పరిగెత్తు పరిగెత్తు' చిత్ర ఫస్ట్ లుక్ విడుదల!
- September 28, 2020
హైదరాబాద్:ఎన్. ఎస్. సినీ ఫ్లిక్స్ బ్యానర్ పై సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య హీరోహీరోయిన్లు గా రామకృష్ణ తోట దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ "పరిగెత్తు పరిగెత్తు" యామినీ కృష్ణ అక్కరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పుర్తి చేసుకుంది. తాజాగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది.
ఈ సందర్భంగా నిర్మాత, యామినీ కృష్ణ అక్కరాజు మాట్లాడుతూ... ‘‘సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో అద్భుతమైన కథ, కథనంతో ఈ చిత్రం రూపొందింది. తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బేస్డ్ మూవీస్ని ఎప్పుడూ ఆదరిస్తుంటారు. "పరిగెత్తు పరిగెత్తు" చిత్రం కూడా ఆ కోవలోనే ఉంటుంది. సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య చాలా బాగా నటించారు. అలాగే మిగతా ఆర్టిస్ట్లు, టెక్నీషియన్స్ సినిమా బాగా రావడానికి ఎంతగానో సహకరించారు. అలాగే ఎన్నో సూపర్హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన సునీల్ కశ్యప్ మా సినిమాకి సంగీతం అందించడం సంతోషంగా ఉంది. కల్యాణ్ సమి బ్యూటిఫుల్ విజువల్స్, వెంకట ప్రభు ఎడిటింగ్, రాజ్కుమార్ ఆర్ట్ వర్క్, శంకర్ స్టంట్స్ సినిమాకి ప్లస్ అవుతాయి. ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉన్నాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలువుతామని అన్నారు.
తాజా వార్తలు
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం