ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

- September 28, 2020 , by Maagulf
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

అమరావతి:ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజగా ఏపీ ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏపీలో 5,487 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,81,161కి చేరింది.ఇందులో 63116  కేసులు యాక్టివ్ గా ఉంటె, 612300 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 37 మంది ప్రాణాలు కోల్పోయారు.  దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 5745కి చేరింది.  ఇక ఇదిలా ఉంటె, జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ లో 310, చిత్తూరులో 329, తూర్పు గోదావరి జిల్లాలో 1010, గుంటూరులో 538, కడపలో 271, కర్నూలులో 113, కృష్ణా జిల్లాలో 97, నెల్లూరులో 489, ప్రకాశంలో 634, శ్రీకాకుళంలో 286, విశాఖపట్నంలో 145, విజయనగరంలో 362, పశ్చిమ గోదావరిలో 903 కేసులు నమోదయ్యాయి.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com