మరోసారి తెలంగాణకు ప్రధమ స్థానం...
- September 30, 2020
హైదరాబాద్:అక్టోబర్ 2 వ తేదీ గాంధీ జయంతిని పురష్కరించుకొని స్వచ్ఛభారత్ దివస్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది ఆరోజున దేశంలో స్వచ్ఛతను సాధించిన రాష్ట్రాలకు అవార్డులు ప్రకటిస్తుంది కేంద్రం. కాగా, ఈ ఏడాది స్వచ్ఛభారత్ అవార్డులకు ఎంపికైన రాష్ట్రాలను కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది స్వచ్ఛత సాధించిన రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ప్రధమ స్థానంలో నిలిచింది. స్వచ్ఛభారత్ లో తెలంగాణ రాష్ట్రం ప్రధమ స్థానం సాధించడం ఇది మూడోసారి. ఇక ఇదిలా ఉంటె, జిల్లాల కేటగిరిలో కరీంనగర్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. అవార్డులను అక్టోబర్ 2 వతేదీన స్వచ్ఛభారత్ దివస్ రోజున ప్రకటించనున్నారు. దేశాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు 2014 అక్టోబర్ 2 వ తేదీన మోడీ సర్కార్ స్వచ్ఛభారత్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రతి రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు