కువైట్ ఎమిర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన బహ్రెయిన్ ప్రధాని
- September 30, 2020
మనామా:కువైట్ ఎమిర్ షేక్ సాబా అల్ అహ్మద్ అల్ జాబెర్ అల్ సాబా మృతి పట్ల బహ్రెయిన్ ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలిఫా బిన్ సల్మాన్ అల్ ఖలిఫా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. కువైట్ ప్రజలతో అరబ్, ఇస్లామిక్ దేశాలు గొప్ప నాయకుడ్ని కొల్పోయాయని అన్నారు. ఆయన లేని లోటు పూడ్చలేమన్నారు. కువైట్ అభివృద్ధికి విశేష కృషి చేసిన ఎమిర్..గల్ఫ్ కార్పోరేషన్ కౌన్సిల్ బలోపేతంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. అలాగే అరబ్ దేశాల హక్కులు, భద్రత, స్థిరత్వం కోసం ఆయన బలంగా వాదించేవారని గుర్తు చేశారు. సమర్ధవంతమైన నాయకత్వంతో పాటు మానవతావాదిగా పేరున్న ఎమిర్ మృతి కువైట్ సోదరులను తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని...అయితే, వారు ఈ విషాదం నుంచి కోలుకొని మరింత అభివృద్ధి దిశగా పయనించాలని బహ్రెయిన్ ప్రధాని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







