కువైట్ ఎమిర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన బహ్రెయిన్ ప్రధాని
- September 30, 2020
మనామా:కువైట్ ఎమిర్ షేక్ సాబా అల్ అహ్మద్ అల్ జాబెర్ అల్ సాబా మృతి పట్ల బహ్రెయిన్ ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలిఫా బిన్ సల్మాన్ అల్ ఖలిఫా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. కువైట్ ప్రజలతో అరబ్, ఇస్లామిక్ దేశాలు గొప్ప నాయకుడ్ని కొల్పోయాయని అన్నారు. ఆయన లేని లోటు పూడ్చలేమన్నారు. కువైట్ అభివృద్ధికి విశేష కృషి చేసిన ఎమిర్..గల్ఫ్ కార్పోరేషన్ కౌన్సిల్ బలోపేతంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. అలాగే అరబ్ దేశాల హక్కులు, భద్రత, స్థిరత్వం కోసం ఆయన బలంగా వాదించేవారని గుర్తు చేశారు. సమర్ధవంతమైన నాయకత్వంతో పాటు మానవతావాదిగా పేరున్న ఎమిర్ మృతి కువైట్ సోదరులను తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని...అయితే, వారు ఈ విషాదం నుంచి కోలుకొని మరింత అభివృద్ధి దిశగా పయనించాలని బహ్రెయిన్ ప్రధాని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం







