కువైట్ ఎమిర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన బహ్రెయిన్ ప్రధాని

- September 30, 2020 , by Maagulf
కువైట్ ఎమిర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన బహ్రెయిన్ ప్రధాని

మనామా:కువైట్ ఎమిర్ షేక్ సాబా అల్ అహ్మద్ అల్ జాబెర్ అల్ సాబా మృతి పట్ల బహ్రెయిన్ ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలిఫా బిన్ సల్మాన్ అల్ ఖలిఫా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. కువైట్ ప్రజలతో అరబ్, ఇస్లామిక్ దేశాలు గొప్ప నాయకుడ్ని కొల్పోయాయని అన్నారు. ఆయన లేని లోటు పూడ్చలేమన్నారు. కువైట్ అభివృద్ధికి విశేష కృషి చేసిన ఎమిర్..గల్ఫ్ కార్పోరేషన్ కౌన్సిల్ బలోపేతంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. అలాగే అరబ్ దేశాల హక్కులు, భద్రత, స్థిరత్వం కోసం ఆయన బలంగా వాదించేవారని గుర్తు చేశారు. సమర్ధవంతమైన నాయకత్వంతో పాటు మానవతావాదిగా పేరున్న ఎమిర్ మృతి కువైట్ సోదరులను తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని...అయితే, వారు ఈ విషాదం నుంచి కోలుకొని మరింత అభివృద్ధి దిశగా పయనించాలని బహ్రెయిన్ ప్రధాని ఆకాంక్షించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com