మరోసారి తెలంగాణకు ప్రధమ స్థానం...
- September 30, 2020
హైదరాబాద్:అక్టోబర్ 2 వ తేదీ గాంధీ జయంతిని పురష్కరించుకొని స్వచ్ఛభారత్ దివస్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది ఆరోజున దేశంలో స్వచ్ఛతను సాధించిన రాష్ట్రాలకు అవార్డులు ప్రకటిస్తుంది కేంద్రం. కాగా, ఈ ఏడాది స్వచ్ఛభారత్ అవార్డులకు ఎంపికైన రాష్ట్రాలను కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది స్వచ్ఛత సాధించిన రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ప్రధమ స్థానంలో నిలిచింది. స్వచ్ఛభారత్ లో తెలంగాణ రాష్ట్రం ప్రధమ స్థానం సాధించడం ఇది మూడోసారి. ఇక ఇదిలా ఉంటె, జిల్లాల కేటగిరిలో కరీంనగర్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. అవార్డులను అక్టోబర్ 2 వతేదీన స్వచ్ఛభారత్ దివస్ రోజున ప్రకటించనున్నారు. దేశాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు 2014 అక్టోబర్ 2 వ తేదీన మోడీ సర్కార్ స్వచ్ఛభారత్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రతి రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







