ఐపీఎల్ 2020: చెన్నైతో రైనా, భజ్జీల అనుబంధం కట్..
- October 02, 2020ఐపీఎల్ 2020లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీతో సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ అనుబంధానికి శాశ్వతంగా తెరపడినట్టే కనిపిస్తోంది. వారిద్దరు మున్ముందు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు లేవని తెలుస్తోంది.
ఇప్పటికే తమ అధికారిక వెబ్సైట్ నుంచి వారిద్దరి పేర్లను తొలగించిన ఆ ఫ్రాంచైజీ వారితో ఒప్పందాలనూ రద్దు చేసుకొనే ప్రక్రియను ఆరంభించిందని సమాచారం. నిబంధనల ప్రకారమే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు లీగ్ వర్గాలు అంటున్నాయి.
2018 వేలం మార్గదర్శకాల ప్రకారం రైనా, భజ్జీతో చెన్నై మూడేళ్ల కాలానికి ఒప్పందాలు చేసుకుంది. ఈ ప్రకారం 2020 సీజన్తో ఒప్పంద గడువు ముగుస్తుంది. వ్యక్తిగత కారణాలతో వారిద్దరూ ఈ ఏడాది లీగ్ ఆడేందుకు నిరాకరించారు. దాంతో నిబంధనల ప్రకారం అధికారికంగా వారితో ఒప్పందాలు రద్దు చేసుకొనేందుకు యాజమాన్యం ప్రక్రియ మొదలుపెట్టిందని తెలిసింది.
ఏడాదికి రూ.11 కోట్లకు రైనా, రూ.2 కోట్లకు భజ్జీతో ఎన్. శ్రీనివాసన్ నేతృత్వంలోని ఫ్రాంచైజీ ఒప్పందాలు చేసుకుంది. ఈ సీజన్లో ఆడటం లేదు కాబట్టి అందులో కొంత డబ్బునూ చెల్లించడం లేదని సమాచారం.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు