అతి పెద్ద అటల్ టన్నెల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

- October 02, 2020 , by Maagulf
అతి పెద్ద అటల్ టన్నెల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ:హిమాలయ పర్వత శ్రేణుల్లో నిర్మించిన అతి పెద్ద అటల్ టన్నెల్‌ను శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇందుకోసం హిమాచల్‌ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్‌లో భారీగా ఏర్పాట్లు చేశారు. 9.02 కిలోమీటర్ల పొడవైన హైవే సొరంగానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టారు. గుర్రపు డెక్క ఆకారంలో నిర్మించిన ఈ టన్నెల్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. అన్నిరకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా దీన్ని మనాలీ-లహౌల్-స్పీతీ లోయలను కలుపుతూ నిర్మించారు. టన్నెల్ నిర్మాణంతో ఈ మార్గంలో ఏడాది పొడవునా ప్రయాణించే వీలు కలిగింది. ఎందుకంటే గతంలో మంచు కురిసే సమయంలో దాదాపు 6 నెలలపాటు ఈ లోయకు వెళ్లడానికి రహదారి సౌకర్యం ఉండేదికాదు. ఈ టన్నెల్ గుండా వాహనాలు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా లేటెస్ట్ టెక్నాలజీతో నిర్మాణం చేపట్టారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com