సంతాప కార్యక్రమంలో పాల్గొననున్న ఇండియన్స్‌

- October 03, 2020 , by Maagulf
సంతాప కార్యక్రమంలో పాల్గొననున్న ఇండియన్స్‌

కువైట్: ఇటీవల తుది శ్వాస విడిచిన ‘లేట్‌ అమిర్‌’ షేక్‌ సబాహ్‌ అల్‌ అహ్మద్‌ అల్‌ జమెర్‌ అల్‌ సబాకి సంతాప కార్యక్రమం ఆదివారం జరగనుంది. ఆదివారం సంతాప కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇండియాలోని ప్రభుత్వ కార్యాలయాలపైనా, అలాగే విదేశాల్లోని భారత హై కమిషన్స్‌ / ఎంబసీస్‌ / కాన్సులేట్స్‌ అలాగే ఇండియా హౌస్‌లపై త్రివర్ణ పతాకాన్ని హాఫ్‌ మాస్ట్‌ చేయనున్నారు. కువైట్‌లోనూ భారత జాతీయ పతాకాన్ని ఎంబసీ ఆఫ్‌ ఇండియా వద్ద హాఫ్‌ మాస్ట్‌ చేస్తారు. రెండు నిమిషాల మౌనాన్ని ఈ సందర్భంగా అధికారులు పాటిస్తారు. కువైట్‌లోని భారతీయులంఆ ఉదయం 11 గంటల నుంచి 2 నిమిషాల పాటు మౌనం పాటించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com