కోవిడ్‌ 19: ఆదివారం స్కూళ్ళకు హాజరు కానున్న టీచర్స్‌, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌

- October 03, 2020 , by Maagulf
కోవిడ్‌ 19: ఆదివారం స్కూళ్ళకు హాజరు కానున్న టీచర్స్‌, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌

బహ్రెయిన్: టీచింగ్‌ మరియు అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌, ఆదివారం స్కూళ్ళకు తిరిగి రావాల్సి వుంటుంది. కొత్త అకడమిక్‌ ఇయర్‌ కోసం ఈ ఏర్పాట్లు చేశారు. కాగా, 1 శాతం స్టాఫ్‌ మెంబర్స్‌ ఇప్పటిదాకా టెస్టింగ్‌ కోసం రాలేదనీ, ఈ కారణంగా వారు ఆదివారం తిరిగి వచ్చే అవకాశం లేదని మినిస్ట్రీ చెబుతోంది. ఆల్టర్‌నేట్‌ స్కూల్‌ అటెండెన్స్‌ విషయమై స్కూల్‌ అడ్మినిస్ట్రేషన్‌ టీచర్లతో సంప్రదింపులు జరుపుతోంది. అక్టోబర్‌ 11 నుంచి పబ్లిక్‌ స్కూల్స్‌ కొత్త విద్యా సంవత్సరం కోసం రీ-ఓపెన్‌ కానున్నాయి. సెప్టెంబర్‌ 16 నుంచి బహ్రెయిన్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సి వుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com