హైదరాబాద్ లోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఆధునిక భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం
- October 03, 2020
హైదరాబాద్ లోని మల్లేపల్లిలో ఉన్న మోడల్ ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఆధునిక భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి ముహమ్మద్ మహమూద్ అలీ శనివారం నాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఐటిఐ కోర్సు మొదటి నుండి చాలా ముఖ్యమైనదని అన్నారు. నేటి అభివృద్ధి యుగంలో కూడా దాని ప్రాముఖ్యతను ఎవరూ నిర్లక్ష్యం చేయలేదన్నారు. 1954 వ సంవత్సరంలో ఈ ఐటిఐ కళాశాల స్థాపించ గా మొత్తం 28 ట్రేడ్లు ఉన్నాయ ని, 772 మంది విద్యార్థుల సంఖ్యను 892 కు పెంచారన్నారు. ఈ కళాశాలకు మోడల్ ఐటిఐ హోదా లభించిందని చెప్పారు. ఐటిఐ కోర్సులు భారతదేశంతో పాటు విదేశాలలో కూడా చాలా త్వరగా ఉపాధి కల్పిస్తాయని హోంమంత్రి చెప్పారు. విద్యా రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యతనిస్తోందని అన్నారు. ముఖ్యంగా, ముఖ్యమంత్రి కల్వకుంట్లచంద్రశేఖర్ రావు తెలంగాణ విద్యా రంగంలో పురోగతి సాధిస్తూ ఉన్నత విద్యను పొందేలా పథకాలు ప్రవేశపెట్టార ని, తెలంగాణ ప్రజలు ఈ సంస్థలను సద్వినియోగం చేసుకొని తమ పిల్లలను విద్యావంతులుగా, నైపుణ్యం గలవారుగా మార్చాలని అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు సి.హెచ్. మల్లా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్లమెంటు సభ్యుడు జాఫర్ హుస్సేన్ మెరాజ్, ఐటిఐ డైరెక్టర్ కె. వై. నాయక్ నాయక్, ప్రిన్సిపాల్ రాధా కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు