హైదరాబాద్ లోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఆధునిక భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం
- October 03, 2020
హైదరాబాద్ లోని మల్లేపల్లిలో ఉన్న మోడల్ ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఆధునిక భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి ముహమ్మద్ మహమూద్ అలీ శనివారం నాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఐటిఐ కోర్సు మొదటి నుండి చాలా ముఖ్యమైనదని అన్నారు. నేటి అభివృద్ధి యుగంలో కూడా దాని ప్రాముఖ్యతను ఎవరూ నిర్లక్ష్యం చేయలేదన్నారు. 1954 వ సంవత్సరంలో ఈ ఐటిఐ కళాశాల స్థాపించ గా మొత్తం 28 ట్రేడ్లు ఉన్నాయ ని, 772 మంది విద్యార్థుల సంఖ్యను 892 కు పెంచారన్నారు. ఈ కళాశాలకు మోడల్ ఐటిఐ హోదా లభించిందని చెప్పారు. ఐటిఐ కోర్సులు భారతదేశంతో పాటు విదేశాలలో కూడా చాలా త్వరగా ఉపాధి కల్పిస్తాయని హోంమంత్రి చెప్పారు. విద్యా రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యతనిస్తోందని అన్నారు. ముఖ్యంగా, ముఖ్యమంత్రి కల్వకుంట్లచంద్రశేఖర్ రావు తెలంగాణ విద్యా రంగంలో పురోగతి సాధిస్తూ ఉన్నత విద్యను పొందేలా పథకాలు ప్రవేశపెట్టార ని, తెలంగాణ ప్రజలు ఈ సంస్థలను సద్వినియోగం చేసుకొని తమ పిల్లలను విద్యావంతులుగా, నైపుణ్యం గలవారుగా మార్చాలని అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు సి.హెచ్. మల్లా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్లమెంటు సభ్యుడు జాఫర్ హుస్సేన్ మెరాజ్, ఐటిఐ డైరెక్టర్ కె. వై. నాయక్ నాయక్, ప్రిన్సిపాల్ రాధా కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







