ఏపీలో కొత్తగా 6,242 కరోనా కేసులు..
- October 04, 2020
అమరావతి:ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 72,811 శాంపిల్స్ను పరీక్షించగా.. 6,242 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 7,06,790కి చేరింది.
కొవిడ్ వల్ల కృష్ణలో ఆరుగురు, అనంతపూర్లో ఐదుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, శ్రీకాకుళంలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, కర్నూల్లో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున 40 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 5,981కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 6,58,875 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 54,400 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన